వైష్ణవ్తేజ్, కృతిశెట్టిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం `ఉప్పెన`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. సుకుమార్తో కలిసి మైత్రీ మూవీమేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలై మంచి టాక్తో ఘనవిజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం విజయేత్సవసంబరాలు జరుపుకుంది.
ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ `నాకిది అద్భుతమైన క్షణం. ఇలాంటి అద్భుతమైన సినిమా ఇచ్చి నన్ను నిజమైన గురువుని చేశాడు బుచ్చిబాబు. కథని బుచ్చి ఎంతో చక్కగా తెరపై ఆవిష్కరించాడు. అనుభవం వున్న దర్శకుడిలా మలిచాడు. ఇది త్వరలో వంద కోట్ల సినిమా అవుతుంది` అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. `మా గురువు సుకుమార్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసినందుకు చాలా ఆనందంగా వున్నాను` అన్నారు దర్శకుడు బుచ్చిబాబు.
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ `మా బ్యానర్లో 9 సినిమాలు తీశాం. తొలి మూడు భారీ విజయాల్ని అందుకున్నాయి. మళ్లీ `ఉప్పెన`తో లాంటి విజయాన్ని అందుకున్నాం. మాకింత పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు` అని తెలిపారు.