`కెరాఫ్ కంచర పాలెం`.. విలక్షణమైన కథ, కథనాలతె తెరకెక్కిన ఈ చిత్రంతో దర్శకుడిగా వెంకటేష్ మహా విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డుల్ని కూడా సొంతం చేసుకుంది. పలు చిత్రోత్సవాల్లోనూ ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తరువాత దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన చిత్రం `ఉమామహేశ్వర ఉగ్రరూపస్య`.
మలయాళ హిట్ ఫిల్మ్ `మహేశింతే ప్రతీకారమ్`. `బాహుబలి` ప్రొడ్యూసర్స్ యార్లగడ్డ శోభు, ప్రసాద్ దేవినేనితో కలిసి `కెరాఫ్ కంచర పాలెం` నిర్మాత పరుచూరి ప్రవీణ ఈ చిత్రాన్ని తెలుగులో `ఉమామహేశ్వర ఉగ్రరూపస్య` పేరుతో నిర్మిస్తున్నారు. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించారు. విభిన్నమైన కథ కావడంతో ఈ చిత్రాన్ని `బాహుబలి` నిర్మాతలు తెలుగులో రీమేక్ చేశారు. ఇటీవలే ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. నరేష్, సుహాస్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలజ్ చేస్తున్నట్టు తెలిసింది.
కరోనా వైరస్ లాక్డౌన్ సడలించడంతో రోజు రోజుకీ విళయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్స్ ఓపెన్ చేయడం కష్టంగా మారింది. ఆగస్టు వరకు పరిస్థితులు మారితే తప్ప థియేటర్స్ తెలిచే పరిస్థితి లేదు. దీంతో చాలా వరకు చిన్న చిత్రాలు, పెద్ద చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సత్యదేవ్ నటించిన