Homeటాప్ స్టోరీస్ఆచార్య కు తెలంగాణ సర్కార్ తీపి కబురు

ఆచార్య కు తెలంగాణ సర్కార్ తీపి కబురు

TS Govt Supports Hike in Ticket Price for Acharya
TS Govt Supports Hike in Ticket Price for Acharya

తెలంగాణ సర్కార్ చిత్రసీమ పట్ల ఎప్పుడు చల్లని చూపే చూస్తుంటుంది. పెద్ద సినిమాల రిలీజ్ టైంలోనే అదనపు షోస్ కు , బెనిఫిట్ షోస్ కు అనుమతి ఇవ్వడం అలాగే వారం రోజుల పాటు టికెట్స్ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వడం వంటివి చేస్తూ నిర్మాతలకు , డిస్ట్రబ్యూటర్స్ కు లాభాలు తెప్పిస్తుంటుంది. ఇప్పటివరకు చాల సినిమాలకు ఇలా చేసింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కిన ఆచార్య చిత్రానికి కూడా ఇలాంటి సదుపాయాలే ఇచ్చింది.

చిరంజీవి, ఆయ‌న కుమారుడు రాంచ‌ర‌ణ్ కలిసి న‌టించిన తాజా చిత్రం ‘ఆచార్య’ ఈ నెల 29న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఐదో ఆట‌కు అనుమ‌తి మంజూరు చేస్తూ తెలంగాణ స‌ర్కారు కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే ఏడు రోజుల పాటు రోజుకు 5 ఆట‌ల చొప్పున ప్ర‌ద‌ర్శ‌న‌కు అవకాశం ఇచ్చింది. సినిమా హాళ్ల‌లో ఆయా కేట‌గిరీల‌ను బ‌ట్టి టికెట్ రేట్ల‌ను కూడా పెంచుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తినిచ్చింది. ఏసీ కేటగిరీలో మాత్ర‌మే ఈ పెంపును ప్ర‌భుత్వం అనుమ‌తించింది. ఈ ధ‌ర‌ల‌ను రూ.30 నుంచి రూ.50కి పెంచుకేనేందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ టికెట్ల పెంపును కూడా ఏడు రోజుల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తించింది. ఈ ప్రకటన తో చిత్ర యూనిట్ తో పాటు మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All