Homeఎక్స్ క్లూసివ్ప్రభాస్ ని ఘోరంగా అవమానించారు

ప్రభాస్ ని ఘోరంగా అవమానించారు

TS Govt Lawyer sensational comments on Hero Prabhas
Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని ఘోరంగా అవమానించారు ప్రభుత్వ తరుపు లాయర్ . ప్రభాస్ ఓ భూకబ్జాదారుడంటూ సంబోదించి సంచలనం సృష్టించాడు . ప్రభుత్వ భూములను కబ్జా చేసేవాళ్ల పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తే అసలు భూములంటూ మిగలవని అందుకే అతడి పట్ల జాలి చూపించాల్సిన అవసరం లేదని వాదించాడు . దాంతో అన్ని కోణాల్లో విచారణ చేసిన న్యాయస్థానం తుది తీర్పుని రిజర్వ్ లో ఉంచింది .

శేరిలింగం పల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలో ప్రభాస్ గెస్ట్ హౌజ్ కట్టుకున్న విషయం తెలిసిందే . అయితే ఆ స్థలాన్ని ఇతరుల ద్వారా కొన్నాడు ప్రభాస్ , కానీ అది ప్రభుత్వ స్థలమని తాజాగా సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో స్పందించిన రెవిన్యూ ఉద్యోగులు ప్రభాస్ గెస్ట్ హౌజ్ కు సీల్ వేశారు దాంతో ప్రభాస్ హైకోర్టు కెక్కాడు . కానీ ప్రభుత్వ లాయర్ ఏకంగా ప్రభాస్ ని భూకబ్జాదారుడు అంటూ నీలాపనిందలు వేసాడు . అంతేకాదు భూమి ని కబ్జా చేసే వాళ్ళ పట్ల కఠిన వైఖరితో ఉండాలని వాదించాడు దాంతో ప్రభాస్ కు తీవ్ర నష్టం జరిగేలా కనిపిస్తోంది . నష్టం సంగతి పక్కన పెడితే ఎవరో అమ్మితే కొన్న స్థలం అది కానీ తీరా సమయానికి కొన్నప్పటికీ కూడా భూకబ్జాదారుడి ముద్ర పడింది పాపం .

- Advertisement -

English Title: TS Govt Lawyer sensational comments on Hero Prabhas

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All