తెలంగాణ ప్రజా ప్రతినిధుల్ని కరోనా వెంటాడుతోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది.
వారం రోజుల క్రితం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని నిజామా బాడ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ని కలిసారుట. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకిన నేపథ్యంలో బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డ వైద్య పరీక్షలు చేయుంచుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఇంటరిగానే కారు నడుపుకుంటూ హైదరాబాద్ రావడం ఆసక్తికరంగా మారింది.
శనివారం నిజామా బాద్ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో 100 మంది పాల్గొన్నట్టు తెలిసింది. బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కి కరోనా పాజిటివ్ అని తేలడంతో మిగతావారంతా హోమ్ క్వారెంటైన్ కి వెళ్లిపోయారు.
- Advertisement -