తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు షాక్ ఇస్తూ బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దమయ్యాడు టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ . సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వెంకటస్వామి కుటుంబం , కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది . వెంకటస్వామి వారసులుగా వచ్చిన గడ్డం వివేక్ , వినోద్ లు ఇప్పుడు రాజకీయంగా సైలెంట్ అయ్యారు .
గత ఎన్నికల సమయంలో వివేక్ కు పార్లమెంట్ స్థానం దక్కుతుందని ఆశించాడు అయితే కేసీఆర్ వివేక్ కు టికెట్ నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేయడమే కాకుండా టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేసాడు . ఇక ఈరోజు ఢిల్లీ వెళ్లి అమిత్ షా సమక్షంలో బీజేపీ లో చేరనున్నాడు . బీజేపీ లో చేరాకా రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది .