త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే . త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రంలో ఇంకా హీరోయిన్ లను ఫైనల్ చేయలేదు . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకులు త్రివిక్రమ్ రష్మిక మందన్న ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నాడట . ఛలో చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన రష్మిక గీత గోవిందం చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టేసింది .
- Advertisement -
దాంతో రష్మిక ని తీసుకుందామని అనుకుంటున్నాడట ! అయితే అల్లు అర్జున్ మాత్రం కియారా అద్వానీ అంటే మోజు పడుతున్నాడట ! దాంతో ఈ ఇద్దరిలో ఎవరు హీరోయిన్ అన్నది ప్రశ్నగా మిగిలింది . హీరో దర్శకుడు ఇలా ఇద్దరిలో ఎవరిదీ పై చేయి అవుతుందో చూడాలి .
English Title: Trivikram wants Rashmika mandanna
- Advertisement -