పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా కలయికలో తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. పవన్ నుండి అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అవన్నీ నిండుగా ఉండడంతో సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా పెద్ద సక్సెస్ అవ్వడం , కలెక్షన్లు సైతం రికార్డ్స్ బ్రేక్ చేస్తుండడం తో చిత్ర యూనిట్ శనివారం సక్సెస్ మీట్ ని ఏర్పటు చేసారు. అయితే ఈ సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్ నోరు విప్పడంతో అభిమానులు ఖుషి అయ్యారు. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో త్రివిక్రమ్ మాట్లాడకపోయేసరికి అంత డిస్పాయింట్ అయ్యారు.
మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`చూసిన త్రివిక్రమ్..ఈ రీమేక్ లో నటించమని పవన్ కల్యాణ్ కి సూచించి నటించేలా చేసాడు. సాగర్ కె చంద్ర ను డైరెక్టర్ గా ఎంచుకొని..త్రివిక్రమ్ వెనుక ఉండి అన్ని చూసుకున్నాడు. స్క్రీన్ ప్లే , మాటలు అందించడమే కాకుండా, నటి నటుల ఎంపిక , లొకేషన్లు ఇలా అన్ని కూడా త్రివిక్రమ్ దగ్గర ఉండి చూసుకున్నాడు. ఆలా అన్ని చేసి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఏమాట్లాడకుండా ఉండేసరికి అంత నిరాశ వ్యక్తం చేసారు. ఎందుకు త్రివిక్రమ్ మాట్లాడలేదు అని చిత్ర మేకర్స్ ను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఈరోజు జరిగిన చిత్ర సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్ తనదైన స్పీచ్ ఇచ్చి ఆకట్టుకున్నారు. సక్సెస్ మీట్ కి త్రివిక్రమ్, దర్శకుడు సాగర్ చంద్ర, సంయుక్త మీనన్, తమన్, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, నాగవంశీ తదితరులు హాజరయ్యారు.