గత ఏడాది `అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్ని సొంతం చేసుకున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఈ మూవీ తరువాత ఆయన రేంజ్ భారీగా మారిపోయింది. ప్రస్తుతం ఆయన పవర్స్టార్ పవన్కల్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న చిత్రానికి మాటలు, స్క్రీన్ప్లే అందిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది.
దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో ఈ చిత్రానికి సంబంధించిన పోరాట ఘట్టాల్ని పవన్కల్యాణ్, రానాలపై చిత్రీకరిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర మేకింగ్ వీడియోని ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు తమన్ కలిసి తిరుపతి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
ఇందు కోసం ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్ ని బుక్ చేసుకుని తిరుపతి వెళ్లారట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కోవిడ్ కారణంగా చాలా మంది స్టార్స్ కామన్ ఫ్లైట్లలో వెళ్లడానికి ఇష్టపడటం లేదు. ఇందులో భాగంగానే త్రివిక్రమ్ తన తిరుపతి ట్రిప్ కోసం ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ ని బుక్ చేసుకున్నారని చెబుతున్నారు.