Homeటాప్ స్టోరీస్క‌రోనా వ‌ల్లే త్రివిక్ర‌మ్ రాలేదా?

క‌రోనా వ‌ల్లే త్రివిక్ర‌మ్ రాలేదా?

క‌రోనా వ‌ల్లే త్రివిక్ర‌మ్ రాలేదా?
క‌రోనా వ‌ల్లే త్రివిక్ర‌మ్ రాలేదా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఈవెంట్ ఏదైనా స‌రే అక్క‌డ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ వుండాల్సిందే. అంత‌లా ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింది. ఆయ‌న చెప్ప‌కుండా ప‌వ‌న్ ఏ ప్రాజెక్ట్ చేయ‌డ‌నే వాద‌న కూడా వుంది. `వ‌కీల్‌సాబ్‌` సెట్ కావ‌డానికి కూడా త్రి‌విక్ర‌మ్ కార‌ణం. ఇటీవ‌ల మొద‌లైన `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` రీమేక్‌లో ప‌వ‌న్ న‌టించ‌డానికి కూడా త్రివిక్ర‌మే కార‌ణం.

ఇంత‌గా ప‌వ‌న్ ని ప్ర‌భావితం చేస్తున్న త్రివిక్ర‌మ్ `వ‌కీల్ సాబ్‌` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో క‌నిపించ‌లేదు. కొన్ని కార‌ణాల వ‌ల్ల రాలేద‌ని ప‌వ‌న్ స‌భా ముఖంగా వెల్ల‌డించినా అది కారోనా వ‌ల్లే త్రివిక్ర‌మ్ రాలేద‌ని స్ప‌ష్టంగా అర్థ‌మైంది. ఇటీవ‌ల వ‌రుస‌గా టాలీవుడ్ స్టార్స్ కోవిడ్ బారిన ప‌డుతున్న విష‌యం తెలిసిందే. `వ‌కీల్‌సాబ్‌` చిత్రంలో న‌టించిన నివేదా థామ‌స్ ఇటీవ‌లే కోవిడ్ బారిన ప‌డ్డాన‌ని, విష‌యం తెలిసిందే వెంట‌నే స్వీయ నిర్భంధంలోకి వెళ్లాన‌ని వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -

తాజ‌.ఆగా స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కూడా కోవిడ్ బారిన ప‌డ్డార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌న వెల్ల‌డించ‌క‌పోయినా గ‌త కొన్ని రోజులుగా త్రివిక్ర‌మ్ కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ కార‌ణంగా త్ర‌విక్ర‌మ్ ఆదివారం రాత్రి జ‌రిగిన `వ‌కీల్ సాబ్ `ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హాజ‌రు కాలేక‌పోయార‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All