మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరపుకుంటోంది. కొరటాల శివ డైరెక్షన్లో కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై హీరో రామ్చరణ్, నిరంజన్రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎండోమెంట్ అధికారిగా, ప్రజానాట్యమండలి కార్యకర్తగా చిరు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్టు ఇటీవల బయటికి లీజ్ అయిన స్టిల్స్తో అర్థమవుతోంది.
ఆగస్టు 14న చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దర్శకుఉ కొరటాల శివ కూడా రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే కీలక సన్నివేశాల్ని పూర్తి చేసిన దర్శకుడు హీరో, హీరోయిన్లకు సంబంధించిన కీలక సన్నివేశాల్ని చిత్రీకరించబోతున్నారు. త్రిష హీరోయిన్గా చిరు సరసన నటిస్తోందని ప్రచారం జరుగుతున్నా ఇంత వరకు సెట్లోకి ఎంటర్ కాలేదు. తాజాగా త్రిష ఎంటర్ కాబోతోందని తెలిసింది.
ఈ వారం తరువాత నుంచే త్రిష ఎంటర్ కాబోతోందట. `ఆచార్య` అనే పేరుని ఈ చిత్రానికి ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ టైటిల్ని చిరు `ఓ పిట్టకథ` ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలియకుండానే బయటపెట్టేసి ఆ తరువాత షాక్కు గురైన విషయం తెలిసిందే.