హీరోయిన్ల ఎఫైర్లు నార్త్తో పోలిస్తే సౌత్లో చాలా తక్కువ. అందులోనూ పెళ్లి వరకు వెళ్లినవే అత్యధికం. నాగార్జున, అమల, రాజశేఖర్ జీవిత, శ్రీకాంత్, ఊహా, సూర్య, జ్యోతిక, మహేష్ , నమ్రత.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఈ మధ్య ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో అంటున్న జంటలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కోలీవుడ్, టాలీవుడ్లో అవి ఈ మధ్య ఎక్కువగానే వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ప్రధానంగా వినిపించిన పేర్లు త్రిష, రానా. ఈ ఇద్దరూ గత కొంత కాలంగా డేటింగ్ లో వున్నారని త్వరలో వివాహం కూడా చేసుకోవచ్చని వార్తలు వినిపించాయి. అయితే ఆ రూమర్లకు చెక్ పెడుతూ మిహీకా బజాజ్ను రానా వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించేశాడు. వీరి వివాహం ఆగస్టు 8న తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో జరగబోతోంది.
ఈ సమయంలోనే త్రిష వివాహానికి సంబంధించిన ఓ వార్త గత కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తోంది. తమిళ నిర్మాతతో ఎంగేజ్మెంట్ వరకు వెళ్లి వివాహం క్యాన్సిల్ కావడంతో త్రిష మళ్లీ సినిమాలపై దృష్టిపెట్టింది. అయితే ఆమె హీరో శింబుని త్వరలో వివాహం చేసుకోనుందంటూ వరుస కథనాలు వినిపిస్తున్నాయి. తన వివాహంపై అటు కోలీవుడ్లోనూ ఇటు టాలీవుడ్లోనూ జోరుగా వార్తలు వినిపిస్తున్నా త్రిష మాత్రం ఈ వార్తలపై స్పందించడం లేదు. సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. త్రిష సైలెంట్కి అర్థం అవుననా లేక ఈ రూమర్ల గురించి తానెందుకు స్పందించాలనా ? అన్నది మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు.