స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ని దాదాపు 500 మంది ట్రైబల్స్ అడ్డుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని కోట గ్రామంలో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే… బన్నీ నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వంలో ముత్యంశెట్టి మీడయా, మైత్రీ మూవీమేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మారేదుమిల్లి డీప్ ఫారెస్ట్లో ‘పుష్ప’ మూవీ షూటింగ్ జరుగుతోంది. బన్నీ పాల్గొనగా పలు కీలక ఘట్టాలని సుకుమార్ చిత్రీకరిస్తున్నారు.
షూటింగ్ కోసం బన్నీతో పాటు చిత్ర బృందం రంపచోదవరం నుండి కోట గ్రామం మీదుగా పందిరిమామిడి వరకు ప్రయాణించాలి. దీంతో ఈ గ్రామంలోని చాలా మంది యువతీ యువకులు భారీ సంఖ్యలో రోజూ షూటింగ్ ప్రదేశానికి చేరుకుంటున్నారు. షూటింగ్కి అంతరాయం అవుతుందని భావించిన చిత్ర బృందం వారిని షూటింగ్ ప్రాంగణంలోకి అనుమతించకుండా అడ్డుకుని తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. ఇది గత కొన్ని రోజులుగా జరుగుతోంది.
దీంతో ఆగ్రహించిన కోట గ్రామస్తులు `పుష్ప` టీమ్పై ఆగ్రహించి తమ గ్రామం మీదుగా వెళుతున్న బన్నీ కారుని దాదాపు 500 మంది అడ్డుకుని షాకిచ్చారట. మ్యాటినీ విగ్రహాన్ని చూడటానికి ఫిల్మ్ యూనిట్ అనుమతించడం లేదని వారు తమ అసంతృప్తిని బన్నీ వద్ద వ్యక్తం చేశారట. విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ కారు నుంచి బయటికి వచ్చి వారితో మాట్లాడినట్టు తెలిసింది. బన్నీ వివరణతో సంతృప్తి చెందిన గ్రామస్తులు శాంతించి బన్నీతో ఫొటోలకు పోటీపడినట్టు తెలిసింది.