టాలీవుడ్ లో ఇప్పటివరకూ ఎన్నో రకాల సినిమాలు వచ్చినా కానీ జొంబీ జోనర్ లో ఇంతవరకూ సినిమా రాకపోవడం నిజంగా గమనార్హం. అయితే తెలుగులో మొట్టమొదటి జొంబి చిత్రాన్ని మనకు జి-జొంబీ చిత్రం ద్వారా అందిస్తున్నారు. ఆర్యన్ గౌర, నేహా శెట్టి ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించగా, దీపికా దర్శకత్వం వహించింది. సూర్య జి-జొంబీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించాడు.
ఫిబ్రవరి 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది. జి-జొంబీ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హీరో ఆర్యన్ గౌర, దర్శకురాలు దీపికా అనాధాశ్రమానికి వెళ్లి అక్కడి పిల్లలతో సరదాగా కాసేపు గడిపారు. అలాగే అక్కడి పిల్లలకు కావాల్సినవి ఇచ్చి వారిని సంతోషపెట్టారు. ఆర్యన్ గౌర ఈ సందర్భంగా మాట్లాడుతూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే నేను ఇటువైపు ప్యాషన్ తో వచ్చాను. దాదాపు ఏడేళ్లు పట్టింది ఈ స్థాయికి రావడానికి. ఇలా ప్రమోషన్స్ లో భాగంగా అనాధాశ్రమానికి రావడం ప్రతీ సినిమా నిర్మాత అలవాటు చేసుకుంటే అందరికీ మంచిది.
అటు ప్రమోషన్స్ కు, ఇటు అనాధాశ్రమానికి కూడా ఇది ఉపయోగపడింది.