Homeటాప్ స్టోరీస్మాట నిలబెట్టుకున్నావు జగనన్నా

మాట నిలబెట్టుకున్నావు జగనన్నా

tollywood thanks to jagan
tollywood thanks to jagan

మొత్తానికి ఏపీలో సినిమా టికెట్స్ ధర పెరగడం..చిన్న చిత్రాలకు ఐదో షో అవకాశం ఇవ్వడం పట్ల చిత్రసీమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పెద్ద సినిమాల నిర్మాతల బాగోగులే కాకుండా చిన్న చిత్రాల నిర్మాతల ఆవేదనను కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అర్ధం చేసుకున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దీ నెలలుగా ఏపీలో జీవో 35 అమలు నడుస్తుంది. ఈ జీవో కారణంగా సినిమా టికెట్ ధరలు టీ ధరకు సమానమయ్యాయి. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన. హౌస్ ఫుల్ తో నడిచిన డిస్టిబ్యూటర్స్ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

ఇలాగైతే సినిమా థియేటర్స్ నడుపలేమంటూ స్వచ్ఛదంగా థియేటర్స్ మూతపడిన రోజులు కూడా ఉన్నాయి. ఇలా అయితే కుదరదని ఏకంగా మెగా స్టార్ రంగంలోకి దిగాడు. ఆయనతో పాటు అగ్ర హీరోలను , దర్శకులను వెంటపెట్టుకొని జగన్ దగ్గర కూర్చున్నాడు. తమ ఆవేదనను జగన్ కు చెప్పగా..దానికి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే కొత్త జీవో తీసుకొస్తామని, అదనపు షోస్ కు అనుమతి ఇస్తామని తెలిపారు. ఇక సోమవారం ఆ ప్రకటన చేసి చిత్రసీమలో ఆనందం నింపారు. కేవలం పెద్ద సినిమాలకు కాకుండా చిన్న సినిమాలకు కూడా మేలు జరిగేలా ఐదో షో కు అనుమతి ఇచ్చి వారిలో ఆనందం నింపారు. ఇక ప్రస్తుతం రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ , ఆచార్య చిత్రాల మేకర్స్ ఈ ప్రకటన తో సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All