కోవిడ్ కారణాల దృష్ట్యా గత పది నెలలుగా సెలబ్రిటీలు వెకేషన్ కి వెళ్లలేని పరిస్థితి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ లో సడలింపులు ఇవ్వడం మొదలుపెట్టడంతో మళ్లీ జనజీవితం రోడ్డెక్కింది. అన్ని రంగాలు క్రమంగా ఊపరి పీల్చుకోవడం మొదలెపెట్టాయి. ఈ క్రమంలో తారలంతా రిలాక్స్ కోసం వెకేషన్కి వెళ్లడం మొదలుపెట్టారు. ఈ మధ్య కాలంలో మాల్దీవులు, గోవా స్టార్స్కి ఫేవరేట్ ప్లేస్లుగా మారిపోయాయి.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అక్కడ సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. కొంత మంది గోవాలో న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. కొంత మంది ఇప్పటికే అక్కడకి వెళ్లిపోయారు. డిసెంబర్ 31 ఉదయం నుంచే టాలీవుడ్ స్టార్స్ గోవాలో సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. ఓ పక్క మేకర్స్ కొత్త సినిమా టీజర్లు, పోస్టర్లతో హంగామా చేయబోతుంటే టాలీవుడ్ స్టార్స్ మాత్రం గోవాలో ఎంజాయ్ చేయడానికి వెళుతున్నారు.
గోవా వెళ్లిన వారిలో చాలా మందే టాప్ స్టార్స్ వున్నారు.నాగచైతన్య, సమంత ఇటీవలే కలిసి గోవా వెళ్లిపోయారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకూడా గురువారం గోవా వెళ్లారు. సందీప్ కిషన్, అక్షరా గౌడ, త్రిధా చౌదరి.. ఇలా టాలీవుడ్ క్రేజీ స్టార్స్ చాలా మందే గోవాకి చెక్కేశారు. ఇప్పటికే అక్కడ న్యూ ఇయర్ సందడి మొదలుపెట్టేశారు.