ప్రముఖ సినీ నటుడు రాజబాబు (64) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈస్ట్ గోదావరి రామచంద్రాపురం మండలం నరసారావుపేటలో 1957 జూన్ 13న రాజబాబు జన్మించారు. చిన్ననాటి నుండి ఆయన నటన మీద ఆసక్తి చూపించారు. చిన్నతనంలోనే నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు. రాజబాబు 1995లో ఊరికి మొనగాడు సినిమాతో నటుడిగా అవకాశం వచ్చింది.
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు రాజబాబు. సింధూరం, సముద్రం, మురారి సినిమాల నుండి ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, భరత్ అనే నేను లాంటి సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. రాజబాబు తన సుధీర్ఘమైన సినీ కెరియర్ లో 65 సినిమాల దాకా చేశారని తెలుస్తుంది. సినిమాల్లోనే కాదు సీరియల్స్ లో కూడా రాజబాబు నటించారు. తెలుగు సూపర్ హిట్ సీరియల్స్ లో ఆయన తనదైన శైలిలో నటించి మెప్పించారు. రాజబాబు మృతిపట్ల సినీ ప్రముఖులు పలువురు తమ సంతాపం తెలియచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.