`మన్మథుడు 2` ఫ్లాప్ కావడంతో అక్కినేని నాగార్జున తన పంథా మార్చుకున్నారు. ఆయన నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `వైల్డ్ డాగ్`. వంశీ పైడి పల్లి వద్ద కొన్ని చిత్రాలకు వర్క్ చేసిన అహిషోర్ సాల్మన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 2009లో హైదరాబాద్లో జరిగిన వరుస బాంబు పేళుళ్ల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
నిరంజన్రెడ్డి, అన్వేష్రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్యాంకాక్, ధాయ్లాండ్లలో కీలక షెడ్యూల్ జరపాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా వైరస్ విజృంభించడంతో ఆ షెడ్యూల్ని నిరవధికంగా వాయిదా వేశారు. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు తాజాగా నాగార్జున మరో యాక్షన్ ఎంటర్టైనర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. `పీఎస్వీ గరుడవేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. నారయణ్ దాస్ నారంగ్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.
ఈ చిత్రానికి `నా రాత నేనే రాసుకుంటా` అనే టైటిల్ని ఫిక్స్ చేశారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్గా మారింది. అయితే ఆ టైటిల్ని తమ చిత్రానికి ఫిక్స్ చేయలేదని, ఇప్పటి వరకు ఏ టైటిల్ని అనుకోలేదని, తమ సినిమాపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.