
మాస్ రాజా రవితేజ ప్రధాన పాత్రలో పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈరోజు ఉగాది సందర్భాంగా సినిమా ఓపెనింగ్ కార్య క్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి.. సినిమా ప్రీలుక్ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ మూవీ లో హీరోయిన్ గా నుపూర్ సనన్ నటిస్తుండగా ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ది కశ్మీర్ ఫైల్స్ ప్రొడ్యూసర్’ అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఓ కీలక రోల్ చేస్తుండడం విశేషం .
- Advertisement -