ఈనెల 23న మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి . నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ” ఎం ఎల్ ఏ ” , శ్రీవిష్ణు హీరోగా నటించిన నీది నాది ఒకే కథ , అలాగే డబ్బింగ్ చిత్రం రాజరథం . ఈ మూడు సినిమాలతో పాటుగా మరికొన్ని చిత్రాలు కూడా విడుదల అయ్యే ఛాన్స్ ఉంది . అయితే ఈ మూడు చిత్రాలు కాస్త ముందు వరుసలో ఉన్నాయి .
- Advertisement -
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ 2018 లో ఇప్పటివరకు సాలిడ్ బ్లాక్ బస్టర్ అయితే రాలేదు దాంతో కనీసం ఓ మోస్తారు హిట్స్ వచ్చినా ఫరవాలేదు అని ఆశగా ఎదురు చూస్తున్నారు బయ్యర్లు , నిర్మాతలు . మరి ఈ మూడు చిత్రాల్లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎం ఎల్ ఏ చిత్రానికి కాస్త మొగ్గు ఎక్కువగా ఉంది . అది కూడా హిట్ అవుతుందో లేక వచ్చినవి వచ్చినట్లుగా మూడు సినిమాలు కూడా ప్లాప్ జాబితాలో చేరుతాయో చూడాలి .
- Advertisement -