వరుణ్ తేజ్ – రాశి ఖన్నా జంటగా నటించిన తొలిప్రేమ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్ల ని కొల్లగొడుతోంది . తొమ్మిది రోజుల్లో 21 కోట్ల షేర్ ని సాధించి సంచలనం సృష్టిస్తోంది . వెంకీ అట్లూరి దర్శకత్వంలో భోగవల్లి ప్రసాద్ నిర్మించిన ఈ తొలిప్రేమ ఫిబ్రవరి 10 న విడుదల అయ్యింది . 2018 లో ఇప్పటివరకు సరైన బ్లాక్ బస్టర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి లభించలేదు ఆ లోటు ని తొలిప్రేమ భర్తీ చేసేలా ఉంది .
తక్కువ బడ్జెట్ లో రూపొందిన తొలిప్రేమ ఇప్పటికే 21 కోట్ల షేర్ ని రాబట్టింది , అంటే రాబోయే రోజుల్లో మరో 15 కోట్ల షేర్ ని వసూల్ చేసే అవకాశం ఉంది . మొత్తానికి వరుణ్ తేజ్ కు ఫిదా తర్వాత వచ్చిన ఈ తొలిప్రేమ ఆ సక్సెస్ ని కంటిన్యూ చేసింది . దాంతో మెగా కుటుంబం చాలా సంతోషంగా ఉంది . ఇక చిరంజీవి సంతోషానికి అంతేలేకుండా పోయింది .
- Advertisement -
- Advertisement -