బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పుడు తొమ్మిదో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటికే ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా ఇంకా హౌజ్ లో 11 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఇకపై కాంపిటీషన్ ఇంకా టఫ్ అవ్వనుంది. ఈ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది ఉన్నారు. శ్రీరామ్ చంద్ర, సిరి, విశ్వ, సన్నీ, కాజల్, ప్రియాంక, జెస్సీ, రవి నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతోన్న ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు.
జెస్సీ, విశ్వ, ప్రియాంకలు ఓటింగ్ ట్రెండ్స్ లో దిగువున ఉన్నారు. జెస్సీ అవ్వడానికి స్ట్రాంగ్ ప్లేయర్ అయినా కూడా గత కొన్ని రోజులుగా ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్నాడు. అది తన గేమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. టాస్క్ లలో పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ చేయలేకపోతున్నాడు. ఇక విశ్వ టాస్క్ ల విషయంలో తన 100 శాతం ఇస్తాడు కానీ ప్రతీ దానికి ఎమోషనల్ అయిపోవడం, చిన్న వాటికే ప్రవోక్ కావడం తనకు వ్యతిరేకంగా పనిచేసాయి.
ప్రియాంక సంగతి కూడా అంతే. మానస్ ను చూసుకోవడం తప్ప ప్రియాంక హౌజ్ లో చేసేదేం లేదు అన్న అభిప్రాయం ప్రేక్షకులలో కలిగింది. మరి వీరిలో ఎవరైనా ఎలిమినేట్ అవుతారా లేక ట్రెండ్ మారి మరొక వ్యక్తి ఎలిమినేషన్ జోన్ లోకి వస్తాడా అన్నది చూడాలి.