సినీ నటి , ఎం ఎల్ ఏ రోజా ఇంట్లో దొంగలు పడ్డారు . పది లక్షల విలువైన వజ్రాల ఆభరణాలు అలాగే బంగారం ఎత్తుకెళ్లారు దాంతో పోలీసులను ఆశ్రయించింది రోజా . కేసు నమోదు చేసుకున్న పోలీసులు రోజా ఇంటిని పరిశీలించి ఇది బాగా తెలిసిన వాళ్ళు చేసిన దొంగతనం అయి ఉంటుందని ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు . రోజా మణికొండ లోని పంచవటి కాలనీ లో ఉంటోంది గతకొంత కాలంగా .
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు జబర్దస్త్ ప్రోగ్రాం తో బాగానే ఆర్జిస్తోంది రోజా అలాగే వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎం ఎల్ ఏ గా కూడా కొనసాగుతోంది . రాయదుర్గం పోలీసులు రోజా దగ్గర విలువైన సమాచారం తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు . గతంలో కూడా పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో చోరీలు జరగడం అందులో అక్కడ పనిచేసే వాళ్లే దొరకడం జరిగిన దాఖలాలు ఉండటంతో ఆ దిశగా విచారం చేస్తున్నారు .
- Advertisement -