HomePolitical Newsప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న వ్యక్తి భారత్ నుంచి

ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న వ్యక్తి భారత్ నుంచి

ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న వ్యక్తి భారత్ నుంచి
ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న వ్యక్తి భారత్ నుంచి

గౌతమ్ అదానీ సంపద గురించి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్‌ కేంద్రంలోని మోదీ సర్కార్‌పై సెటైర్ వేస్తూ కామెంట్ చేశారు. ‘బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ తర్వాత గౌతమ్ అదానీ ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. అదానీ నికర ఆస్తుల విలువ 10.9 లక్షల కోట్ల రూపాయలు. ఫిబ్రవరి 2022లో ఆయన నికర విలువ రూ. 6.6 లక్షల కోట్లు. భారతదేశం వృద్ధి చెందడం లేదని ఎవరు చెప్పారు?’ అంటూ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ట్వీట్ చేశారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ ట్వీట్‌కు కేటీఆర్ బదులిస్తూ.. ‘ప్రతి పేద భారతీయుడికి వాగ్దానం చేసిన రూ.15 లక్షల మొత్తాన్ని ఒకే ఖాతాలో జమ చేశారేమో.. పొరపాటున తప్పు జరిగిందా మోదీ జీ?’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘కేవలం ఆర్నెళ్లలో సంపద ఆ స్థాయికి పెరగడం మానవమాత్రుడెవరికీ ఒక జన్మలో సాధ్యం కాదు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే.. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. తన సంపాదనలో ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించడం గమనార్హం.

- Advertisement -

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గౌతమ్ అదానీ సంపద 137.4 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రపంచంలో మూడో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచిన తొలి ఆసియా వ్యక్తి అదానీనే కావడం విశేషం. చైనాకు చెందిన జాక్ మా, భారత్‌కు చెందిన ముఖేశ్ అంబానీకి కూడా సాధ్యం కాని రికార్డును అదానీ అందుకున్నారు. ప్రస్తుతం గౌతమ్ అదానీ కంటే, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాత్రమే ముందున్నారు. ఎలోన్ మస్క్, బెజోస్ చాలా కాలంగా తొలి స్థానంలో కొనసాగుతున్నారు. గౌతమ్ అదానీ ప్రసిద్ధ ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ ఎల్‌విఎంహెచ్ మోయెట్ హెన్నెస్సీ లూయిస్ విట్టన్ యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి ఎగబాకారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All