వరుణ్ తేజ్ నటిస్తున్న వాల్మీకి చిత్ర టైటిల్ ని మార్చాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాడు మాజీ ఎం ఎల్ ఏ , బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ . క్రిష్నయ్య . తమిళంలో సంచలన విజయం సాధించిన ” జిగర్ తండా ” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు వాల్మీకి పేరుతో . వాల్మీకి బోయ కులస్థుల ఆరాధ్య దైవం దాంతో మా కులదైవాన్ని కించ పరుస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బోయ కులస్థులు.
ఇప్పటికే పలుమార్లు డిమాండ్ చేయగా దాని మీద ఎవరూ పెద్దగా స్పందించలేదు . దాంతో కాబోలు నాయకుడు ఆర్ . క్రిష్నయ్య ని రంగంలోకి దించారు . ఇక ఆర్ . క్రిష్నయ్య వాల్మీకి చిత్ర బృందానికి వార్నింగ్ ఇస్తున్నాడు టైటిల్ మార్చండని . ఈ విషయం పై దర్శకులు హరీష్ శంకర్ ఎలా స్పందిస్తాడో చూడాలి .
- Advertisement -