అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `థ్యాంక్యూ బ్రదర్`. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. మాగుంట శరత్చంద్రారెడ్డి, తారక్ భూమిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఎగ్జైటింగ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీని మేకర్స్ ఈ నెల 30న వరల్డ్ వైడ్గా థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ మూవీని ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం సోమవారం ప్రకటించింది.
మే 7న ఈ మూవీని తొలి తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ `ఆహా`లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. `సాధ్యమైనంత సురక్షిత మార్గంలో మీకు వినోదం పంచుతుండటం అదృష్టంగా భావిస్తున్నాం. ఆనందించండి` అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల తేదీని నటి అనసూయ వెల్లడించారు.
ఓ యువకుడు, గర్భవతి అయిన ఓ మహిళ అనుకోకుండా లిఫ్టులో ఇరుక్కుంటారు. అప్పుడు వారెలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఈ క్రమంలో వారు ఫీలైన ఎమోషన్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రమేష్ రాపర్తి ఆద్యంతం ఆసక్తికరంగా రకెక్కించారు. మౌనికారెడ్డి, ఆదర్శ బాలకృష్ణ, వైవా హర్ష కీలక పాత్రల్లో నటించారు. గుణ బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించారు.
Get ready for a thrilling drama, with an unmissable twist! ????#ThankyouBrother World Premiere on May 7, only on #ahavideoIN.@anusuyakhasba @viraj_ashwin @monie_kaa @anishkuruvilla @Raparthy @sureshragutu1 @gunasekaran_gm @MaguntaSarath @JustOrdinaryEnt @adityamusic pic.twitter.com/XAsPKt8VIN
— ahavideoIN (@ahavideoIN) April 26, 2021