తెలుగులో ధృవ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . రాంచరణ్ – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రానికి తమిళ మాతృక ” తని ఒరువన్ ” కు రీమేక్ అన్న విషయం విదితమే ! కాగా ఇప్పుడు ఆ తని ఒరువన్ చిత్రానికి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట ! తమిళనాట తని ఒరువన్ చిత్రంలో నయనతార – జయం రవి జంటగా నటించారు . మోహన్ రాజా దర్శకత్వం లో తెరకెక్కింది ఈ తని ఒరువన్ . తమిళనాట సంచలన విజయం సాధించిన తని ఒరువన్ చిత్రానికి సీక్వెల్ చేయాలనీ సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు మోహన్ రాజా .
జయం రవి హీరోగా నటించిన ఆ చిత్రంలో విలన్ గా ఒకప్పటి గ్లామర్ హీరో అరవింద స్వామి నటించాడు . స్టైలిష్ విలన్ గా అరవింద్ స్వామి నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు . తమిళనాట ప్రభంజనం సృష్టించిన తని ఒరువన్ కి రీమేక్ వస్తే మళ్ళీ అదే స్థాయిలో విజయాన్ని అందుకునేలా ఉండాలి కాబటి భారీ ఎత్తున కసరత్తులు చేస్తున్నాడట దర్శకుడు మోహన్ రాజా .
English Title: thani oruvan sequel on cards