టాలీవుడ్లో ప్రస్తుతం వినిపిస్తున్న పేరు తమన్.. తమన్..`అల వైకుంఠపురములో` సినిమాతో తమన్ పేరు ఇండస్ట్రీలో మరింతగా మారు మ్రోగిపోతోంది. ఏ దర్శకుడిని కదిలించినా తమన్ పేరే వినిపిస్తోంది. అంతాగా తన సంగీతంతో ప్రతీ ఒక్కరినీ ప్రభావితం చేశాడు. `అల వైకుంఠపురములో` చిత్ర విజయానికి తమన్ అందించిన సంగీతం ప్రధాన భూమికగా నిలిచింది. ఈ సినిమా తరువాత తమన్కు భారీ ఆఫర్లు రావడం మొదలైంది.
ప్రస్తుతం పవర్స్టార్ పవన్కల్యాణ్ నటిస్తున్న `వకీల్సాబ్` చిత్రానికి తమన్ సంగీంత అందిస్తున్నారు. శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని బోనీకపూర్తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ `మగువా.. మగువా..` సాంగ్ని రిలీజ్ చేశారు. భారీ రెస్పాన్స్ అభించింది. ఇదిలా వుండగా తమన్కు మరో భారీ ఆఫర్ లభించినట్టు తెలిసింది.
2012లో విజయ్ హీరోగా ఎ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం `తుపాకి`. తెలుగు, తమిళ భాషల్లో ఇడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. స్లీపర్ సెల్స్ పాయింట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇన్నేళ్ల తరువాత ఈ చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నారు. స్క్రిప్ట్ని పూర్తి చేసిన దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెల్ కోసం తమన్ని మ్యూజిక్ డైరెక్టర్గా ఫిలక్స్ చేసినట్టు తెలిసింది