స్టార్ కంపోజర్ ఎస్.తమన్ గత కొన్ని సంవత్సరాలుగా తన హవాని కొనసాగిస్తున్నాడు. తమన్ ఏ సినిమా చేసినా ఆ మూవీ ఆడియో హిట్టే.. అనేంతగా మ్యూజిక్ అందిస్తూ వస్తున్నాడు. గత ఏడాది తమన్ చేసిన ప్రతీ సినిమా ఆల్బమ్ బ్లాక్ బస్టర్ హిట్టే. గత ఏడాది ప్రారంభంలో చేసిన `అల వైకుంఠపురములో` సాంగ్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాయి.
ఈ మూవీ పాటలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. యూట్యూబ్లో ఈ చిత్రంలోని పాటలు రికార్డు స్థాయి వ్యూస్ని రాబట్టి ఆల్ టైమ్ రికార్డుని సృష్టించాయి. ఈ మూవీ ఆల్బమ్ కారణంగా ఈ ఏడాది తమన్ వరుసగా భారీ ఆఫర్లని దక్కించుకున్నాడు.ఇటీవల `క్రాక్` మూవీతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న తమన్ తాజాగా `సర్కారు వారి పాట` చిత్రానకి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం దుబాయ్లో జరుగుతోంది.
ఈ సందర్భంగా `సర్కారు వారి పాట` మ్యూజిక్ గురించి మహేష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమన్ ని ప్రశ్నించారు. `బ్రో మాకు చాలా సమయం ఉంది.. `సర్కారు వారి పాట` కోసం ఈ సారి బుల్లెట్ ని కరెక్ట్గా దింపేద్దాం` అని సమాధానం ఇచ్చాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.