నటుడు సోను సూద్ లాక్డౌన్ సమయంలో అభాగ్యుల పాలిట దేవుడిగా నిలిచారు. ఎక్కడ అవసరం వుందంటే అక్కడ నేనున్నానంటూ ఆపన్నులకు అండగా నిలిచారు. సడన్ లాక్డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కార్మికులకు అండగా నిలిచి వారిని గమ్యస్థానాలకు చేర్చడంలో ప్రభుత్వాల కంటే ముందు వరుసలో నిలిచారు.
వలస జీవులకు పెద్దన్నగా నిలిచిన సోనుసూద్ని అంతా రియల్ హీరో అంటూ ప్రశంసల్లో ముంచేస్తున్నారు. ఇదిలా వుంటే ఆయనకు తెలంగాణలో ఏకంగా ఓ గ్రామ ప్రజలు గుడి కట్టడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలోని దుబ్బా తండా గ్రామంలో సోనుసూద్కు గుడి కట్టించారు. అందులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించి స్థానికులు పూజలు చేయడం ఆసక్తికరంగా మారింది.
దుబ్బ తండాకు చెందిన శిల్పి మధుసూదన్ పాల్, స్థానికుడు రమేష్కుమార్ సోను విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శిల్పి మాట్లాడుతూ ` నటుడు సోనుసూద్ తన సేవా భావంతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన చేసిన సేవల్ని ఇండియాతో పాటు యావత్ ప్రపంచం గుర్తించింది` అన్నారు. సోను సేవల్ని మెచ్చి ఐక్యరాజ్య సమితి స్డిజి స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డును అందించి సత్కరించిన విషయం తెలిసిందే.