Homeటాప్ స్టోరీస్అమెరికాలో తెలుగు కుర్రాడి కాల్చివేత

అమెరికాలో తెలుగు కుర్రాడి కాల్చివేత

telugu student sharat murderd in americaఅమెరికాలో తెలుగు కుర్రాడ్ని కాల్చివేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది . ఇప్పటికే పలువురు తెలుగువాళ్ళ పై జాత్యాహంకారంతో దాడులు చేస్తుండగా కొంతమంది గాయాలతో బయట పడగా కొంతమంది కాల్చివేత కు గురవుతున్నారు . నిన్న సాయంత్రం అమెరికాలోని కేన్సాస్ నగరంలో ఈ సంఘటన జరిగింది . వరంగల్ జిల్లా కరీమాబాద్ కి చెందిన శరత్ కొప్పుల అమెరికాలోని కేన్సాస్ నగరంలోని ఓ రెస్టారెంట్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు . ఎం ఎస్ చదువుకోవడానికి ఆరు నెలల క్రితమే వెళ్లిన శరత్ తల్లిదండ్రులకు చెప్పకుండా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు .

అయితే ఆ రెస్టారెంట్ కు ఓ నల్ల జాతీయుడు వచ్చి రెస్టారెంట్ లో తిన్న తర్వాత శరత్ దగ్గరకు వచ్చి బిల్ ఎంతయ్యింది అని అడగడంతో 30 డాలర్లు అయినట్లు తెలిపాడట శరత్ , అతడు బిల్ ఎమౌంట్ చెప్పడమే ఆలస్యం రివాల్వర్ తీసి అయిదు రౌండ్ల కాల్పులకు పాల్పడ్డాడు . ఒక్కసారిగా కాల్పుల మోత మోగడంతో కేన్సాస్ నగరం అట్టుడికిపోయింది . శరత్ తల్లిదండ్రులు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు . తండ్రి రామ్మోహన్ బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగి కాగా తల్లి మాలతి కూడా ప్రభుత్వ ఉద్యోగి కావడం విశేషం .

- Advertisement -

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తనయుడు విగతజీవి గా మారడంతో రామ్మోహన్ – మాలతి లు కన్నీరు మున్నీరు అవుతున్నారు . వాళ్ళని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు . శరత్ మృతదేహాన్ని ఇండియాకు త్వరగా రప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసారు భారత అధికారులు .

English Title: telugu student sharat murderd in america

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All