టివి 5 ఎడిటర్ సినిమా రంగంలోని మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతడిపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు , మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు ని స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు . ఇటీవల నటుడు , రచయిత పోసాని కృష్ణమురళి ఓ లైవ్ షోలో పాల్గొన్న సందర్బంగా సదరు టివి ఛానల్ ఎడిటర్ సినిమా రంగంలోని మహిళలను అసభ్య పదజాలం తో దూషించాడు .
దాంతో అతడి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ శివాజీరాజా నేతృత్వంలోని టాలీవుడ్ బృందం జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టారు . శివాజీరాజా వెంట యాంకర్ ఝాన్సీ , హేమ , దర్శకురాలు నందిని రెడ్డి , ఉత్తేజ్ , బెనర్జీ ఉన్నారు .
- Advertisement -