ప్రముఖ దర్శకులు కే. విశ్వనాధ్ ఇంటికి వచ్చి పలకరించి సంచలనం సృష్టించాడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు . కే విశ్వనాధ్ ఆరోగ్యం గురించి వాకబు చేయడమే కాకుండా గంటకు పైగా ఆయనతో సమాలోచనలు చేసి మీరు మళ్ళీ సినిమా తీయాలి , సందేశాత్మక చిత్రం చేస్తానంటే ఆ సినిమాని నిర్మించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి మరింత సంచలనం సృష్టించాడు కేసీఆర్ .
విశ్వనాధ్ దర్శకత్వం వహించిన శంకరాభరణం చిత్రాన్ని 25 సార్లు చూసాను , ఇప్పటికి కూడా ఖాళీ సమయం దొరికితే తప్పకుండా ఆయన చిత్రాలు చూస్తుంటాను , ఈమధ్య కాలంలో మంచి సినిమాలు రావడం లేదు అందుకే మీరు మళ్ళీ ఓ సినిమా తీయాలి దాన్ని నేనే నిర్మిస్తాను అంటూ చెప్పడంతో విశ్వనాద్ ఉబ్బి తబ్బిబ్బై పోతున్నాడు . కుచేలుడి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చినట్లుగా భావిస్తున్నానని , అయితే సినిమా తీసే ఓపిక మాత్రం లేదని తెలిపాడు . కేసీఆర్ విశ్వనాద్ ఇంటికి వస్తున్న విషయం మీడియాకు తెలియడంతో విశ్వనాద్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని అందుకే పరామర్శ కోసమే కేసీఆర్ వస్తన్నారని పుకార్లు షికారు చేసాయి దాంతో విశ్వనాధ్ చాలా బాధపడ్డాడు .