అర్జున్ రెడ్డి చిత్రంతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ నటిస్తున్నచిత్రం టాక్సీవాలా. ఇటీవలే ఈ చిత్రానికి సంభందించిన ఫస్ట్ లుక్ టీజర్ కి చాలా క్రిటికల్ అప్లాజ్ రావటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని పోస్ట్ప్రోడక్షన్ శరవేగంగా జరుపుకుంటోంది. జూన్ రెండవ వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు. మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ2 పిక్చర్స్ మరియు యు.వి.క్రియెషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా….రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ పాపులారిటీ ఎలా పెరిగిందో తెలిసిందే. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసుపోకుండా టాక్సీవాలా చిత్రం రూపుదిద్దుకుంటోంది. విజయ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిపోతుంది. జూన్ రెండవ వారంలో ఈచిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండియర్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ… విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని నిర్మించాము. విజయ్ ఇమేజ్ కి తగ్గట్టుగానే అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా టాక్సీవాలా లో క్యారెక్టర్ ను దర్శకుడు రాహుల్ తీర్చిదిద్దాడు. విజయ్ మ్యానరిజమ్స్ యూత్ విపరీతంగా ఆకట్టుకుంటాయి, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ ఈ చిత్రం లో హైలైట్ గా నిలుస్తాయి. స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మించాం. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూన్ రెండవ వారంలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండియర్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.
నటీనటులు
విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణుసావిత్రి భర్త జెమిని గణేశన్ అన్న విషయం అందరికీ తెలిసిందే . స్త్రీ లోలుడు అయిన జెమిని గణేశన్ ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు ఇక నలుగురిలో ముగ్గురికి సంతానం కలుగగా అందులో ఏడుగురు ఆడవాళ్లు ఒక్కడే అబ్బాయి . మొత్తం ఎనిమిది మంది జెమిని గణేశన్ సంతానం . ఆ ఎనిమిది మందిలో మొదటి భార్య అలిమేలు కు డాక్టర్ జయ శ్రీధర్ , డాక్టర్ రెవితి స్వామినాధన్ , డాక్టర్ కమలా సెల్వరాజ్ ,నారాయణి గణేశన్ అనే నలుగురు కూతుర్లు .
ఇక రెండో భార్య పుష్పవల్లి కి బాలీవుడ్ హీరోయిన్ రేఖ , రాధా సయ్యద్ లు ఇద్దరు సంతానం , ఇక మూడో భార్య సావిత్రి కాగా ఆమెకు ఇద్దరు సంతానం అందులో విజయ చాముండేశ్వరి , సతీష్ లు . మొత్తం ఎనిమిది మంది జెమిని గణేశన్ సంతానం కాగా ఇటీవల చెన్నై లో ఏడుగురు జెమిని గణేశన్ కూతుర్లు కలిశారు దాంతో వాళ్ళ గ్రూప్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది . మహానటి విడుదల అయిన సమయంలో జెమిని గణేశన్ – సావిత్రి ల విషయాల పట్ల నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .