Homeగాసిప్స్డబ్బులు తీసుకొని సైలెంట్ అయ్యిందా ?

డబ్బులు తీసుకొని సైలెంట్ అయ్యిందా ?

Tanusree dutta silant on Me Too
Tanusree dutta and Nana Patekar

బాలీవుడ్ భామ తనుశ్రీ దత్తా బాలీవుడ్ నటుడు నానా పటేకర్ పై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే . అయితే ఇప్పుడేమో సైలెంట్ అయిపొయింది తనుశ్రీ దత్తా . కొద్దిరోజుల క్రితం వరకు నానా పటేకర్ పై విరుచుకుపడిన ఈ భామ సైలెంట్ అయిపోవడంతో పెద్ద మొత్తం లో డబ్బులు తీసుకొని సైలెంట్ అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి . గత పదేళ్లుగా విదేశాలలో ఉంటున్న ఈ భామ ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది .

వచ్చి రావడంతోనే నానా పటేకర్ పై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది . అయితే నానా పటేకర్ వెంటనే తనుశ్రీ దత్తా పై పరువునష్టం దావా వేస్తానని అన్నాడు కానీ తను శ్రీ పై ఎలాంటి కేసు పెట్టలేదు . తనుశ్రీ దత్తా మరింతగా రెట్టించిన వేగంతో నానా పై ఆరోపణలు చేయడంతో ఆ వివాదం పెద్దది కాకముందే రాజీ చేసుకుంటే మేలని భావించిన ఓ అగ్ర నిర్మాత పెద్ద ఎత్తున తనుశ్రీ దత్తా కు డబ్బులు ఇప్పించినట్లుగా తెలుస్తోంది . అందుకే తనుశ్రీ దత్తా నోరు మెదపకుండా ఉందని , మళ్ళీ విదేశాలకు వెళ్లిపోయిందని అంటున్నారు .

- Advertisement -

English Title: Tanusree dutta silant on Me Too

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All