బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య గత కొంత కాలంగా తన టీమ్లో పనిచేస్తున్న ఓ డ్యాన్సర్ని పోర్న్ వీడియోలు చూడమంటూ మానసికంగా వేధిస్తున్నాడని వార్తలు బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సదరు మహిళ గణేష్ ఆచార్యపై కేస్ కూడా ఫైల్ చేయించింది. లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ఖాన్ కూడా గణేష్ ఆచార్యపై సంచలన ఆరోపణలు చేయడంతో బాలీవుడ్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
దీనికి తనుశ్రీ దత్తా మరింత ఆజ్యం పోస్తూ గణేష్ ఆచార్య పాపాల చిట్టా నిండిపోయిందని, అతన్ని క్షమించాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా అతనిపై నిషేధం విధించాల్సిందేనని ప్రకటించడం సంచలనంగా మారింది. 12 ఏళ్ల క్రితం `హారన్ ఓకే ప్లీజ్ ` సెట్లో తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తెలిసినా క్కడే వుండి గణేష్ ఆచార్య వేడుక చూశాడని, అలాంటి వ్యక్తి మంచి వాడు కాదని తాను ఆనాడే చెప్పినా తన మాటని ఎవరూ పట్టించుకోలేదని తనుశ్రీ దత్తా వాపోయింది.
తనలోని స్ఫూర్తిని, ధైర్యాన్ని చంపేయడం వల్లే ఆ రోజు తను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయానని, ఇప్పటికి అతని పాపాల చిట్టా నిండిపోయిందని, ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, ఇలాంటి వ్యక్తిని ఇండస్ట్రీ నుంచి నిషేధించాల్సిందేని తనుశ్రీ ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.