తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోన్న కొన్ని కొత్త ఏర్పాట్లు ప్రజలకు నచ్చుతున్నాయి. ముఖ్యంగా ట్యాంక్ బండ్ ను ఆదివారం సాయంత్రం ప్రజల కోసం వదిలేయడం అనేది అద్భుతంగా వర్కౌట్ అయిన ఐడియా. దీనికి విశేష స్పందన వస్తోంది. ప్రజల నుండి మొదలైన ఈ ఆలోచనను టిఆర్ఎస్ ప్రభుత్వం అమలులోకి వచ్చేలా చేసింది. ప్రతీ వారాంతం హైదరాబాద్ ప్రజలు ట్యాంక్ బండ్ వద్దకు వచ్చి సేద తీరుతున్నారు. దాంతో పాటు వివిధ రకాల ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి.
ఇప్పుడు అదే తరహాలో చార్మినార్ ప్రాంతాన్ని కూడా చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదన వస్తోంది. ట్యాంక్ బండ్ వద్ద వస్తోన్న విశేష స్పందనను అనుసరించి మంత్రి కేటీఆర్, అసదుద్దీన్ ఒవైసిలకు ఒక ఆలోచన వచ్చింది. అదే చార్మినార్ ప్రాంతంలో కూడా ఈ తరహా ఏర్పాట్లు ప్రజల కోసం చేస్తే బాగుంటుంది అని.
హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఐఏఎస్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రజల నుండి ఏమైనా సూచనలు, సలహాలు చెప్పమని కోరారు. దాని ప్రకారంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తామని కోరారు.
Minister @KTRTRS & MP #Hyderabad Janab @asadowaisi Saab, noticing the overwhelming response to Sunday-Funday at #Tankbund have suggested that a similar event can be planned at #Charminar every Sunday!
Suggestions / advice welcome so that we can plan accordingly pic.twitter.com/FC41EMhKOM
— Arvind Kumar (@arvindkumar_ias) October 11, 2021