Homeగాసిప్స్ఏంటి మైండ్ బ్లాక్ తమన్నా పాట కాదా?

ఏంటి మైండ్ బ్లాక్ తమన్నా పాట కాదా?

ఏంటి మైండ్ బ్లాక్ తమన్నా పాట కాదా?
ఏంటి మైండ్ బ్లాక్ తమన్నా పాట కాదా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ్యవరహాల్లో మునిగి తేలుతున్న విషయం తెల్సిందే. మరోవైపు ఈ చిత్రానికి ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. ప్రతి సోమవారం ఈ చిత్రంలో నుండి ఒక పాటను విడుదల చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ప్రాసెస్ లో విడుదలైన మొదటి పాట మైండ్ బ్లాక్. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఈ పాట స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే.

ఈ పాటలో మహేష్ డ్యాన్స్ అదరగొడతాడని, ఇందులో మహేష్ లుంగీ కట్టి స్టెప్పులు వేస్తాడని, మహేష్ అభిమానులకు ఈ పాట పూర్తి వినోదం పంచడం ఖాయమని వార్తలు గుప్పుమన్నాయి. దాంతోపాటే ఈ పాటలో తమన్నా కూడా స్పెషల్ అట్రాక్షన్ కానుందని, తన మిల్కీ అందాలతో మాస్ ఆడియన్స్ చేత కేక పెట్టిస్తుందని కూడా అన్నారు. అయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం మైండ్ బ్లాక్ లో ఉండేది తమన్నా కాదుట. నిజానికి ఈ చిత్రంలో రెండు స్పెషల్ సాంగ్స్ ను ప్లాన్ చేసాడట అనిల్ రావిపూడి. అందులో భాగంగా మైండ్ బ్లాక్ వేరే హీరోయిన్ చేయగా, తమన్నా “ఆజా మేరా ఘర్” అంటూ హిందీలో ఆరంభమయ్యే లిరిక్స్ తో సాంగ్ లో ఆడిపాడిందట. ఇది కాశ్మీర్ నేపథ్యంలో సాగే స్పెషల్ సాంగ్ గా చెబుతున్నారు. ఇది కూడా అదిరిపోతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

- Advertisement -

మరి ఈ పాటను వచ్చే సోమవారం విడుదల చేస్తారో లేక ఆఖరి పాటగా ఉంచుతారో తెలీదు. ఏదేమైనా సరిలేరు నీకెవ్వరుపై మార్కెట్లో మంచి అంచనాలే ఉన్నాయి. టీమ్ కూడా ఈ చిత్రంపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండడంతో మహేష్ ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు.

రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెల్సిందే. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జనవరి 11న భారీ లెవెల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All