
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తోన్న ఆర్ ఆర్ ఆర్ తర్వాత శంకర్ చిత్రంలో నటిస్తాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది.
ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను రూపొందిస్తారు. తాజా సమాచారం ప్రకారం మిల్కీ బ్యూటీ తమన్నాను ఈ సినిమా కోసం అప్ప్రోచ్ అయ్యాడట శంకర్. కీలక పాత్ర కోసం తమన్నాను తీసుకోవాలని అనుకుంటున్నాడు. అయితే దీనిపై తమన్నా ఇంకా తన నిర్ణయాన్ని తెలియచేయలేదు.
ఇక ఇంకా టైటిల్ నిర్ణయించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ తండ్రీ, కొడుకులుగా డబల్ రోల్ లో కనిపిస్తాడు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకత్వం అందించనున్నాడు. మిగతా కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలోనే తెలుస్తాయి. 2022 సమ్మర్ కు ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.