Homeటాప్ స్టోరీస్బాలీవుడ్‌పై తాప్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

బాలీవుడ్‌పై తాప్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

బాలీవుడ్‌పై తాప్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
బాలీవుడ్‌పై తాప్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

బాలీవుడ్‌లో సుశాంత్ మ‌ర‌ణం ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. దీనిపై గ‌త నెల రోజుల‌కు పైగా చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ సెల‌బ్రిటీల్లో బంధు ప్రీత్ వుంద‌ని, ఆ కార‌ణంగానే సుశాంత్ ఆత్మ హ‌త్య చేసుకున్నాడంటూ నెటిజ‌న్స్ సెల‌బ్రిటీల‌పై మండి ప‌డుతున్నారు. అన్ ఫాలో స్టార్స్ అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా బాలీవుడ్‌పై వార్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

చాలా రోజుల త‌రువాత తాప్సీ బాలీవుడ్‌లో వున్న నెపోటిజ‌మ్‌పై స్పందించింది. తెలుగులో `ఝుమ్మంది నాదం` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన తాప్సీకి ఆ త‌రువాత కూడా అదే త‌ర‌హా గ్లామ‌ర్ పాత్ర‌లే రావ‌డంతో టాలీవుడ్ కు టాటా చెప్పేసి బాలీవుడ్ బాట పట్టింది. న‌ట‌న‌కు ప్రాధాన్య‌త వున్న పాత్ర‌ల్లో మాత్ర‌మే న‌టిస్తూ న‌టిగా అన‌తి కాలంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

- Advertisement -

తాజాగా తాప్సీ బాలీవుడ్‌లో వున్న నెపోటిజ‌మ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. తాను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాన‌ని, త‌న‌తో పాటు స్వ‌ర భాస్క‌ర్ కూడా స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొంద‌ని వెల్ల‌డించింది. కంగ‌న లాంటి వాళ్లే నెపోటిజ‌మ్‌పై ఫైట్ చేస్తోంది. అయితే తాము మాత్రం క‌ర‌ణ్ జోహ‌ర్ వంటి వారికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న‌ట్టు జ‌రుగుతున్న ప్ర‌చారంలో నిజం లేద‌ని, తాము క‌ర‌ణ్ జోహార్‌కి వ్య‌తిరేకం కాదు. అలా అని బంధు ప్రీతికి మ‌ద్ద‌తు నివ్వ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసింది. సుశాంత్ మ‌ర‌ణం త‌రువాత ఎవ‌రైనా బాలీవుడ్‌లో రావాలంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితుల‌ను నెల‌కొల్పార‌ని వాపోయింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All