మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు. అంటే సరిగ్గా నెలరోజులు కూడా లేదు. దీంతో సైరా టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలను వేగవంతం చేసారు. ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో విఎఫ్ఎక్స్ పనులను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రన్ టైమ్ ను ప్రాధమికంగా లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. మొదటి రష్ చూసుకున్నాక 2 గంటల 45 నిమిషాల నిడివి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే టీమ్ మొత్తం మరోసారి కూర్చుని సినిమా నిడివిని మరింత తగ్గించేందుకు కృషి చేస్తారని తెలుస్తోంది. మరి ఫైనల్ రన్ టైమ్ కూడా ఇంతే ఉంటుందా లేక మరింత తగ్గుతుందా అన్నది చూడాలి.
- Advertisement -