మెగాస్టార్ చిరంజీవి తన పదేళ్ల కలని సైరా నరసింహారెడ్డి రూపంలో నెరవేర్చాడు కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తండ్రి ప్రేమపై మక్కువ మార్కెట్ కు ఎంత స్కోప్ ఉంది, ఎంతవరకు బిజినెస్ చేయొచ్చు అంటూ వ్యాపార లెక్కలు వేయకుండా చేతికి ఎముక లేని చందంగా ఖర్చుపెట్టేసాడు. దర్శకుడు ఏది అడిగితే అది సమకూర్చి దాదాపు 200 కోట్లు పెట్టి సైరాను తెరకెక్కించాడు రామ్ చరణ్.
దాంతో హిందీలో ఈ సినిమా దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ లలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. మిగతా భాషల్లో సినిమా ప్లాప్ అయినా తెలుగులో అయినా హిట్ అవుతుందనుకున్నారు. మెగాస్టార్ తిరుగులేని ఇమేజ్, పాట్రియాటిక్ ఫీల్ వెరసి సైరా ఒక అద్భుతమైన ఫీల్ ను అయితే తీసుకొచ్చింది కానీ తెలుగులో ఈ సినిమా సేఫ్ వెంచర్ అవ్వలేకపోయింది నైజాం, సీడెడ్ లో తప్పితే ఈ సినిమా అన్ని చోట్లా దాదాపు 25 శాతానికి మించి నష్టపోయినట్లు తెలుస్తోంది.
నిజానికి ఈ పద్దతి ఇప్పటిది కాదు, ఎప్పటినుండో ఉన్నదే. ఒక సినిమా పోతే, ఆ తర్వాతి సినిమాకు తక్కువ రేట్లకు హక్కులు కట్టబెట్టడమో లేక ప్లాప్ అయ్యాక కొంత భర్తీ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే సైరాతో తాము పూర్తి సంతృప్తిగా ఉన్నామని రామ్ చరణ్ ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెల్సిందే. దాంతో సైరాను కొని నష్టపోయిన బయ్యర్లకు సహాయపడాలని మెగాస్టార్, మెగా పవర్ స్టార్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.