Homeటాప్ స్టోరీస్చిరంజీవి సైరా సరికొత్త సంచలనం

చిరంజీవి సైరా సరికొత్త సంచలనం

Sye raa Narasimhareddy creates non baahubali record in Karnataka
Sye raa Narasimhareddy creates non baahubali record in Karnataka

 

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంతో సరికొత్త సంచలనం సృష్టించాడు . సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని కర్ణాటకలో సొంతం చేసుకోవడానికి ఏకంగా 32 కోట్లకు బేరం కుదుర్చుకున్నారని తెలిసి షాక్ అవుతున్నారు ట్రేడ్ వర్గాలు . కర్ణాటకలో తెలుగు చిత్రాలకు అందునా అగ్ర హీరోలకు భారీ డిమాండ్ ఉంది . ఇక చిరంజీవి చిత్రాలకు అయితే తెలుగులో మాదిరిగానే విపరీతమైన డిమాండ్ ఉంది .

- Advertisement -

దాంతో పోటీకి వెళ్లి 32 కోట్లకు కర్ణాటక హక్కులను సొంతం చేసుకున్నారట అంటే బాహుబలి రికార్డ్ లకు దగ్గరలో ఉందన్న మాట . ఇక నాన్ బాహుబలి చిత్రాల్లో సైరా నెంబర్ వన్ గా నిలిచింది . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్నాడు చిరు . ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 2 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All