రెవిన్యూ అధికారులు సైరా …… నరసింహారెడ్డి సెట్ ని కూల్చేయడంతో ఎక్కడో వేసి ఇబ్బంది పడేకంటే సొంత స్థలం లోనే వేసుకుంటే బెటర్ అని భావించి కోకాపేట లోని సొంత స్థలం లో మళ్ళీ సైరా సెట్ వేసారట . ఇంతకుముందు బూత్ బంగ్లా లో వేసిన సైరా ….. నరసింహారెడ్డి సెట్ ని రెవిన్యూ డిపార్టుమెంట్ కూల్చేసిన విషయం తెలిసిందే . ఇంతకుముందు అదే స్థలంలో చరణ్ నటించిన రంగస్థలం సెట్ ని వేసారు . దాంతో అదే స్థలంలో సైరా వేయగా రివర్స్ అయ్యింది దాంతో మళ్ళీ సెట్ వేశారు .
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తుండటం విశేషం . చిరంజీవి తో పాటు అమితాబ్ బచ్చన్ , నయనతార , జగపతిబాబు , విజయ్ సేతుపతి తదితర ప్రముఖులు నటిస్తున్న ఈ చిత్రం పై ఒకవైపు వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి . ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా తీస్తూ మాకు కనీసం మాట మాత్రం కూడా చెప్పలేదని , మా మనోభావాలు కించ పర్చారని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులు మీడియా కెక్కారు . ఆ సమస్య ని నిర్మాత ఎన్వీ ప్రసాద్ పరిష్కరిస్తానని మాట ఇచ్చాడు మరి ఆ పరిష్కారం ఎంత వరకు వచ్చిందో ! మళ్ళీ సెట్ వేయడంతో మరో షెడ్యూల్ కు రంగం సిద్ధం అవుతోంది .
English Title: sye raa narasimha reddy hero set in kokapet