కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా సోమవారం రాత్రి ముంబైలోని ఓ ప్రముఖ క్లబ్లో దాదాపు 35 మంది ఆర్థ్ర రాత్రి వరకు పార్టీ చేసుకున్నారు. వారిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అందులో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుస్సన్నేఖాన్ వుందన్న వార్త కలకలం సృష్టిస్తోంది. మాజీ భారత క్రికెటర్ సురేష్ రైనా కూడా ఈ పార్టీలో పాల్గొనడంతో సర్వత్రా హాట్ టాపిక్గా మారింది.
అయితే ఈ వార్తలపై హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుస్సన్నేఖాన్ తాజాగా స్పందించింది. పోలీసులు తనని అరెస్ట్ చేశారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తనని ఎవరూ అరెస్ట్ చేయలేదని తనపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. `సోమవారం రాత్రి తనకు అత్యంత ఆప్తుడైన ఓ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో నేను పాల్గొన్నాను. ఇందు కోసం ముంబైలోని ఓ ప్రముఖ క్లబ్లోకి వెళ్లాం. తెల్లవారు ఝామున 2:30 గంటలకు కొంత మంది అధికారులు క్లబ్లోకి ప్రవేశించారు.
క్లబ్ నిర్వాహకులు పాటిస్తున్న నియమ నిబంధనల్ని పరిశీలించారు. ఆ సమయంలోనే క్లబ్లో వున్న వారిని మూడు గంటల పాటు అక్కడే వుండాలని ఆదేశించారు. ఆ తరువాత ఉదయం 6 గంటకు మమ్మల్ని బయటికి పంపించారు. వారు మమ్మల్ని ఎందుకు మూడు గంటల పాటు వెయిట్ చేయించారన్నది మాత్రం అర్థం కాలేదు` అని హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుస్సన్నేఖాన్ స్పష్టం చేశారు.