కేంద్ర మాజీ మంత్రి సుస్మా స్వరాజ్ చివరిసరిగా చేసిన ట్వీట్ ఏంటో తెలుసా …… ”నరేంద్ర మోడీ జీ ….. ప్రధానమంత్రి గారు కృతఙ్ఞతలు ఈరోజు కోసమే నేను జీవితకాలం నుండి ఎదురు చూస్తున్నాను ” అంటూ ట్వీట్ చివరి ట్వీట్ చేసారు . ఇప్పుడా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతకుముందు అమిత్ షా గురించి కూడా ప్రశంసలు కురిపించింది సుస్మా స్వరాజ్ .
ఆర్టికల్ 370 ని రద్దు చేయడం సాహసోపేతమైన చర్యగా అభివర్ణించింది సుస్మా స్వరాజ్ . ఆర్టికల్ 370 ని రద్దు చేసి కాశ్మీర్ ని భారత్ లో అంతర్భాగమని చాటి చెప్పాలని సుస్మా కూడా ఎంతో పోరాటం చేసింది . అయితే ఆ కోరిక నెరవేరిన సమయంలోనే సుస్మా స్వరాజ్ కన్నుమూయడంతో విషాద ఛాయలు నెలకొన్నాయి . సుస్మా స్వరాజ్ చనిపోవడంతో చివరి ట్వీట్ వైరల్ గా మారింది .
प्रधान मंत्री जी – आपका हार्दिक अभिनन्दन. मैं अपने जीवन में इस दिन को देखने की प्रतीक्षा कर रही थी. @narendramodi ji – Thank you Prime Minister. Thank you very much. I was waiting to see this day in my lifetime.
— Sushma Swaraj (@SushmaSwaraj) August 6, 2019