Homeటాప్ స్టోరీస్సుశాంత్ మళ్లీ సోలోగా మొద‌లెట్టాడు!

సుశాంత్ మళ్లీ సోలోగా మొద‌లెట్టాడు!

సుశాంత్ మళ్లీ సోలోగా మొద‌లెట్టాడు!
సుశాంత్ మళ్లీ సోలోగా మొద‌లెట్టాడు!

`చి||ల‌|| సౌ||` చిత్రంతో మంచి సినిమా చేశాడ‌ని ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న సుశాంత్ ఆ త‌రువాత సోలోగా సినిమా చేయ‌లేదు. అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్న ఆయన మ‌ళ్లీ సోలోగా సినిమా మొద‌లుపెట్టాడు. సుశాంత్ న‌టిస్తున్న విభిన్న క‌థాచిత్రం `ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిల‌ప‌రాదు`. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌.

ఎఐ స్టూడియోస్‌, శాస్త్రా మూవీస్ బ్యాన‌ర్‌ల‌పై ర‌విశంక‌ర్ శాస్త్రి, హ‌రీష్ కోయిలగుండ్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం లాంఛ‌నంగా ప్రారంభమైంది. కొత్త ర‌హా క‌థ‌త‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌న్ రూపొందించ‌నున్నార‌ట. పోస్ట‌ర్ నుంచే ఆస‌క్తిని ఏకెత్తిస్తున్నఈ సినిమా స్క్రిప్ట్ త‌న‌ని బాగా ఆక‌ట్టుకుంద‌ని, ఇక నుంచి ప్ర‌తి చిత్రాన్ని కొత్త త‌ర‌హా క‌థ‌ల‌తో చేయాల‌నుకుంటున్నాన‌ని ఈ సంద‌ర్భ‌గా హీరో సుశాంత్ వెల్ల‌డించారు.

- Advertisement -

వెంక‌ట్‌, వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గోమ‌టం, ఐశ్వ‌ర్య ర‌వివ‌ర్మ‌, హ‌రీష్ కోయిలగుండ్ల త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో అయినా సుశాంత్ కెరీర్ స‌క్సెస్‌ల బాట‌ప‌డుతుందేమో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All