బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హఠాన్మరణం తో బాలీవుడ్ వార్తల్లో నిలిచింది. నేపాటిజమ్ కారణం గానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ నెటిజన్స్, బాలీవుడ్ లోని ఓ వర్గం సల్మాన్ ఖాన్, కారం జోహార్ లపై మండి పడుతున్నారు. ఈ ఉదంతం నేపథ్యంలో నెటిజన్స్ అన్ ఫాలో ఉద్యమాన్ని మొదలు పెట్టారు.
టాప్ సెలెబ్రిటీస్ ని అన్ ఫాలో చేయడం మొదలైంది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ వున్న స్టార్స్ ఖాతా మెల్ల మెల్లగా ఖాళి అవుతోంది. సుశాంత్ ఫాన్స్, నెటిజన్స్ అలియా భట్ ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఆమెని అం ఫాలో చేసిన వారి సంఖ్య హాఫ్ మిలియన్ కు పెరిగి అలియా ఖాతాలో ఫాలో అవుతున్న వారి సంఖ్యా హాఫ్ మిలియన్ తగ్గి షాకిచ్చింది. ఈ సంఖ్య మరింతగా తగ్గే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
అలియాభట్ ని నెటిజన్స్ టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం సుశాంత్మ మానసిక సమస్యతో బాధపడుతున్నాడని హేష్ భట్. ఓ వీడియో లో వివాదాస్పదవ్యాఖ్యలు చేయడమే అని తెలిసింది . అలియాభట్ తెలుగులో రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్ ‘ నటించనున్న విషయం తెలిసిందే. కరోనా జాడలు విప్పుతున్న నేపథ్యంలో ‘ఆర్ ఆర్ ఆర్ ‘ షూటింగ్ కష్టంగా మారింది.
- Advertisement -