నాగచైతన్య హీరోగా నటిస్తున్న రొమాంటిక్ ఫీల్ గుడ్ ఫిల్మ్ `లవ్స్టోరీ`. సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. లాక్డౌన్ బిఫోర్ ఈ మూవీ షూటింగ్ 15 రోజులు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. బ్యాలెన్స్గా వున్న షూటింగ్ని పూర్తి చేయాలని శేఖర్ కమ్ముల ప్రయత్నించినా కరోనా కారణంగా కుదరలేదు.
మొత్తానికి ఈ నెల 7న చిత్ర బృందం మళ్లీ షూటింగ్ మొదలుపెట్టింది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ప్రత్యే జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేయడం మొదలుపెట్టింది. 15 రోజుల్లో షూటింగ్ మొత్తం సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలని పక్కా ప్రణాళికతో ప్రారంభించారు. ఇదిలా వుంటే ఈ చిత్రం నుంచి ఈ నెల 20న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట.
ఈ నెల 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం టీజర్ లేదా సాంగ్ టీజర్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నట్టు తెలిసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యే పనేనా అని ఓకింత అనుమానాలు వ్యక్తం అవుతున్నా శేఖర్ కమ్ముల మాత్రం ఈ టైమ్ని బాగా వినియోగించుకునే అవకాశం వుందని చెబుతున్నారు. ఈ నెలఖరు వరకు చిత్రీకరణ పూర్తి చేయబోతున్నారట. డిసెంబర్లో సినిమాని రిలీజ్ చేయాలని కూడా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.