నటుడిగా సూర్య స్థాయి గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అయితే రీసెంట్ గా సూర్య కొంత రూట్ మార్చాడు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు కాకుండా అర్ధవంతమైన చిత్రాలకు తన ఓటు వేసాడు. ఈ నేపథ్యంలోనే ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలూ కూడా ఓటిటిలోనే విడుదల కాగా ఈ రెండు చిత్రాలూ కూడా విశేషమైన రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. సక్సెస్ సంగతి పక్కన పెడితే ఈ రెండు చిత్రాలు కూడా సూర్యకు గౌరవాన్ని తీసుకొచ్చాయి.
చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తోన్న సూర్య ఇప్పుడు తన తర్వాతి చిత్రంతో సిద్ధమవుతున్నాడు. ఈసారి ఓటిటి కాకుండా థియేటర్లలోనే తన చిత్రాన్ని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు. సో రెండేళ్ల తర్వాత సూర్య చిత్రం థియేటర్లలోకి రానుంది. తమిళ్ లో విభిన్నమైన సినిమాలతో క్రేజ్ ను తెచ్చుకున్న పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి ఈటీ (ఈతర్క్కుమ్ తునింధవన్) టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇప్పుడు ఈ చిత్ర రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
ఫిబ్రవరి 4, 2022న ఈ చిత్రం విడుదల కానుంది. అంటే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఆచార్యతో డైరెక్ట్ క్లాష్ కు సిద్ధమయ్యాడు సూర్య.
ఇవి కూడా చదవండి:
ఆచార్య సాంగ్ ప్రమోషన్స్ మళ్ళీ షురూ!!
సూర్య జై భీమ్ ఓటిటి డేట్ వచ్చేసింది!!
సూర్య జై భీమ్ కూడా ఓటిటి బాట పట్టిందిగా
#EtharkkumThunindhavan is releasing on Feb 4th, 2022!@Suriya_offl @pandiraj_dir #Sathyaraj @immancomposer @RathnaveluDop #SaranyaPonvannan #MSBhaskar @priyankaamohan #Vinay @sooriofficial @AntonyLRuben @VijaytvpugazhO #ETOnFeb4th pic.twitter.com/hwuwEkX3Bm
— Sun Pictures (@sunpictures) November 19, 2021